కోనసీమ: వంద రోజుల్లోనే ప్రజల మనసులు గెలుచుకున్న కూటమి ప్రభుత్వం వచ్చే అయిదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పోటాపోటీగా చేస్తామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శనివారం పంచాయితీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించారు. అలాగే పంచాయితీ పారిశుధ్య కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.