సత్యసాయి: మడకశిర మండలం యు.రంగాపురం క్రాస్లో ఉన్న ఉగ్ర నరసింహస్వామి దేవాలయాన్ని శనివారం రాత్రి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, నియోజకవర్గ ఇంఛార్జ్ గుండుమల తిప్పేస్వామి సందర్శించారు. అక్కడికి వచ్చిన వారికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో వారు పాల్గొని నరసింహ స్వామిని దర్శించుకున్నారు.