కృష్ణా జిల్లా: ఈనెల 24 నుంచి రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల ఫుట్బాల్ టోర్నీని కానూరులోని అనుమోలు ప్రభాకర్ మైదానంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై.శేషగిరిరావు ఒక ప్రకటన విడుదల చేశారు. 24 నుంచి 26 వరకు ఈ పోటీలు జరుగుతాయని, రాష్ట్రంలోని 12 జిల్లాల జట్లు పాల్గొంటున్నాయని ఆయన చెప్పారు.