కోనసీమ: తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద కల్తీ నీచమైన పని అంటూ ఆలమూరు మండలం చెముడులంక విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిరసన తెలిపారు. జగన్ చిత్రపటాన్ని దహనం చేశారు. లడ్డూ నాణ్యతపై ఎప్పటి నుంచో వివాదం జరుగుతుందని కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.