TDP: 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాల టీడీపీ అభ్యర్థులు వీరే

టీడీపీ తుది జాబితాను ప్రకటించింది. మిగిలిన 9 అసెంబ్లీ స్థానాలకు, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 02:43 PM IST

TDP: ఆంధ్రప్రదేశ్‌లో జరగబోవు ఎన్నికలకు టీడీపీ కూటమి సన్నద్దం అయింది. ఇన్ని రోజులు సందిగ్దంలో ఉన్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అనంతపురం అర్బన్ లో ప్రభాకర్ చౌదరికి నిరాశ ఎదురయింది. అలాగే కదిరి నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చుకుంది టీడీపీ. మొదటి జాబితాలో అక్కడ కందికుంట యశోదకు అవకాశం ఇచ్చారు. తాజాగా అక్కడ అభ్యర్థిని మార్చి తన భర్త కందికుంట వెంకటప్రసాద్‌కు అవకాశం ఇచ్చారు.

చదవండి:Tirumala: అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం

అసెంబ్లీ అభ్యర్థుల జాబితా:

చీపురుపల్లి – కళా వెంకట్రావు
భీమిలి – గంటా శ్రీనివాసరావు
పాడేరు (ఎస్టీ) – కిల్లు వెంకటరమేశ్ నాయుడు
దర్శి – గొట్టిపాటి లక్ష్మి
రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం
ఆలూరు – వీరభద్ర గౌడ్
గుంతకల్లు – గుమ్మనూరు జయరామ్
అనంతపురం అర్బన్ – దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
కదిరి – కందికుంట వెంకటప్రసాద్

పార్లమెంట్ అభ్యర్థుల జాబితా:

విజయనగరం – కలిశెట్టి అప్పలనాయుడు
ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి
అనంతపురం – అంబికా లక్ష్మీనారాయణ
కడప – భూపేశ్ రెడ్డి.

చదవండి:Nara Lokesh: జగన్ అయిదేళ్ల అరాచక పాలనతో జనం విసిగిపోయారు

Related News

PM Modi: ముస్లీంలే మాకు అన్నం పెట్టేవారు.. ప్రధాని మోడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

తాను ఎప్పటికీ మస్లింలకు వ్యతిరేకం కాదని, కావాలని ఆయన మాటలను వక్రీకరించారని ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఇంటర్వూలో చెప్పారు. చిన్నప్పుడు ముస్లిం పండుగలలో పాల్గొనేదని, వారు ఇచ్చిన అన్నమే ఇంట్లో అందరూ తినేదని చెప్పుకొచ్చారు. సబ్‌కా సాథ్‌-సబ్‌కా వికాస్‌ను బలంగా నమ్ముతానని ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.