E.G: ప్రభుత్వం CPSను రద్దు చేసి, ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించాలని గోపాలపురం ASO జోడాల వెంకట్ కోరారు. CPS రద్దుకై విశాఖలో ఆదివారం జరుగుతున్న దీక్షకు గోపాలపురం నుంచి CPS ఎంప్లాయిస్ రాష్ట్ర సంఘ సెక్రటరీ రొయ్యల నాగ దుర్గారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు శాంతి, తదితరులు వెళ్లారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు.
SKLM: శ్రీకాకుళంలోని సింహద్వారం వద్ద ఉన్న స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాల్ రావు 34వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజగోపాల్ రావు రాజకీయాల్లో ఒక మహోన్నత వ్యక్తి త్వమని కొనియాడారు. వరుసగా ఆరు పర్యాయాలు శ్రీకాకుళం ఎంపీగా సేవలందించారని.
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి స్వర్ణ పుష్పార్చన ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో కన్నుల పండుగగా ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ కల్యాణ మండపంలో వేద మంత్రాల నడుమ స్వామివారి స్వర్ణపుష్పార్చన జరిగింది.
CTR: నింద్ర మండలం కొప్పేడు గ్రామంలో రూ. 36 లక్షల వ్యయంతో నిర్మాణం జరగనున్న విలేజ్ హెల్త్ సెంటర్ (V.H.C)కు భూమి పూజ కార్యక్రమంలో ఆదివారం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్లో గ్రామస్తులకు ఆధునిక వైద్య సౌకర్యాలు అందించడానికి ఈ కేంద్రం ముఖ్య పాత్ర వహిస్తుందని పేర్కొన్నారు.
ATP: తాడిపత్రి మండలంలోని హుస్సేనాపురం గ్రామ ఎస్సీ కాలనీలో శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు కాకర్ల రంగనాథ్ ఈ కార్యక్రమానికి హాజరై శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెరగాలని, ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
VZM: బొబ్బిలి తారక రామ కాలనీను ఆదివారం పోలీసులు చుట్టుముట్టారు. డీఎస్పీ భవ్య రెడ్డి ఆదేశాలు మేరకు టిఆర్ కాలనీలో పట్టణ, రూరల్ సీఐలు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అపరిచితులను గుర్తించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. నేరాలను నివారించేందుకు అనుమానిత గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
PPM: చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు 28 వ వార్షికోత్సవం సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుటుంబ సమేతంగా అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రములను సమర్పించారు. ముందుగా కమిటీ సభ్యులు, ఆలయ పూజారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం పొందారు.
KDP: పెండ్లిమర్రి సమీపంలోని భైరవగుట్టపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. కడప వైపు నుంచి వేంపల్లి వైపు వెళ్తున్న మూడు స్కూటర్లను ప్రమాదవశాత్తు వెనుక వైపు నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపు ముగ్గురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AKP: కోటవురట్ల మండలం పాములవాక పశువైద్యశాలకు వచ్చిన పశువుల దాణా లారీని వైసీపీ మండల అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు అడ్డుకున్నారు. లారీలో పశువుల దాణా బస్తాలను అర్హులైన YCP సానుభూతిపరులకు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో గ్రామానికి రెండు పశువుల దాణా లారీలు రాగా వాటిని అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో టీడీపీ వారికి పంపిణీ చేశారని ఆరోపించారు.
KRNL: చిప్పగిరిలోని శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా అలూరు MLA విరుపాక్షి రూ. 50,000 విరాళాన్ని ఇవాళ అందజేశారు. ఆలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రబిందువులని, దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ASR: చింతూరు మండలం సింగనగూడెం టర్నింగ్ వద్ద తమిళనాడు నుంచి జైపూర్కు వెళ్తున్న కారు ఇవాళ ఉదయం ప్రమాదానికి గురైంది. కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం కారణంగా వాహనం నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
TPT: వెంకటగిరి పట్టణంలోని 4 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు 23వ తేదీ సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు అన్ని విధాల చర్యలను విద్యాశాఖాధికారులు తీసుకున్నారు. వెంకటగిరి, బాలాయపల్లి మండలాల్లో మొత్తం జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలు 6 ఉన్నాయి. వెంకటగిరిలో మూడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. సుమారు 1300 మంది విద్యార్థులు హాజరవుతారు.
CTR: పాలసముద్రం ప్రభుత్వ జూ.కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసి సీసీ కెమెరాల నిఘా, 144 సెక్షన్ పెట్టామని ప్రిన్సిపల్ హేమలత తెలిపారు. రేపటి నుంచి 196 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్టు పెర్కొన్నారు. పరీక్షల గదుల్లో గాలి, వెలుతురు, తాగునీరు, మూత్ర శాలల పారిశుద్ద్యం ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని పలు వార్డులలో రూ. 43 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, ప్రజలకు అవసరమయ్యే వనరులు సమకూర్చే దిశగా పనిచేస్తామన్నారు.
NLR: బుచ్చి పట్టణంలోని బెజవాడ గోపాల్ రెడ్డి పార్క్లో నగర కమిషర్ బాలకృష్ణ ఆధ్వర్యలో హ్యాపీ సండే కార్యక్రమం జరిగింది. విద్యార్థుల ఆటలు, డాన్స్లు వేయగా మెప్మా ఆర్పీలు పాటలతో సందడి చేశారు. వారం రోజుల నుంచి పని ఒత్తిడితో జీవిస్తూ ఆదివారం నాడు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మనసు ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతి నెలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.