• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘వెంకటేశ్వర స్వామి ఫోటోలు రాజకీయ ప్రదర్శన చేయడం తగదు’

ELR: ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలను రాజకీయ ప్రదర్శనలకు వినియోగించడం అత్యంత నీచమైన పని అని ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు అన్నారు. శనివారం ఉంగుటూరు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడి, తీవ్రంగా ఖండించారు. 

February 21, 2026 / 06:05 PM IST

జీరో వేస్ట్‌పై కేజీహెచ్‌లో అవగాహన ర్యాలీ

VSP: కేజీహెచ్‌లో ‘జీరో వేస్ట్–లిటిల్ గవర్నెన్స్’ థీమ్‌పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఐ. వాణి ఆధ్వర్యంలో డాక్టర్లు, నర్సులు, నర్సింగ్ విద్యార్థులు, సిబ్బంది ర్యాలీ చేపట్టారు. పాల్గొన్న వారితో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు.

February 21, 2026 / 06:05 PM IST

గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

VZM : గంజాయి రవాణకు పాల్పడినా, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతోపాటు, చెక్ పోస్టులను బలోపేతం చేసామని తెలిపారు. గంజాయి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే 1972కు సమాచారం అందించాలన్నారు.

February 21, 2026 / 06:04 PM IST

వైసీపీ జిల్లా SM కార్యదర్శిగా పెదపాటి చిన్నబాబు

E.G: వైసీపీ జిల్లా సోషల్ మీడియా కార్యదర్శిగా పెదపాటి చిన్నబాబును నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. గోపాలపురం నియోజకవర్గంలోకి చెందిన చిన్నబాబు, పార్టీ పథకాలు, కార్యాచరణను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తానేటి వనితకు కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 06:02 PM IST

‘భూ తాగాదాలకు పరిష్కారం-రాజీ మార్గమే’

PPM: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, దానికి కఠిన శిక్షలు తప్పవని లోక్ అదాలత్ సభ్యులు మరియు సీనియర్ న్యాయవాది టీ. జోగారావు అన్నారు. శనివారం గరుగుబిల్లిలో పార్వతీపురం మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్బంగా జోగారావు మాట్లాడుతూ.. భూతగాదాలు సమాజ శాంతి భద్రతపై ప్రభావం చూపుతాయని అన్నారు.

February 21, 2026 / 06:02 PM IST

క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధికి రూ. లక్ష విరాళం

AKP: ఎస్ రాయవరం మండలం రేవు పోలవరంలో యువత కోసం క్రికెట్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. దీని అభివృద్ధి కోసం గ్రామానికి చెందిన వాసుపల్లి అడవిరాజు రూ. లక్ష విరాళాన్ని ప్రకటించారు. శనివారం చెక్కును రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా గ్రామ యువతకు అందజేశారు. క్రీడలను ప్రోత్సహించడానికి దాతలు ముందుకు రావాలని హోం మంత్రి పిలుపునిచ్చారు.

February 21, 2026 / 06:02 PM IST

మదనపల్లిలో బీజేపీ శిక్షణ మహాభియాన్ ప్రారంభం

అన్నమయ్య: మదనపల్లిలోని కృష్ణ కళ్యాణ మండపంలో ‘పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026’ కార్యక్రమం శనివారం జరిగింది. BJP పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుష్పలత మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో శిక్షణ తరగతులు నిర్వహించాలని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో ఈ శిక్షణలు కీలకమని ఆమె సూచించారు.

February 21, 2026 / 06:02 PM IST

కుప్పనపూడిలో గోమాతకు శ్రీమంతం

W.G: ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలో వైసీపీ ఆకివీడు మండల అధ్యక్షులు నంద్యాల లక్ష్మి సీతారామయ్య స్వగృహం వద్ద శనివారం వేద పండితుల వేద ఆశీర్వచనాలతో గోమాతకు శ్రీమంతం చేశారు. గోమాతను పూజిస్తే సుఖశాంతులు కలుగుతాయని తెలిపారు. నంద్యాల లక్ష్మీ సీతారామయ్య దంపతులు, పవన్ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.

February 21, 2026 / 06:02 PM IST

రోడ్డు భద్రతపై విద్యార్థులకు పోలీసుల అవగాహన

సత్యసాయి: పరిగిలోని సేవా మందిర్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డ్రగ్స్ నివారణ, రోడ్డు భద్రత, బాల్య వివాహాలు, ఫోక్సో చట్టాలపై డీఎస్పీ నర్సింగప్ప అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.

February 21, 2026 / 06:00 PM IST

గవిమఠం శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి సన్నిధిలో విశ్వేశ్వర రెడ్డి

ATP: ఉరవకొండలో గవిమఠం శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠం పీఠాధిపతిని కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. రథోత్సవానికి తరలివచ్చిన భక్తులతో ఆయన ముచ్చటించారు.

February 21, 2026 / 06:00 PM IST

‘డ్రగ్ ఫ్రీ జీవనం గడపాలని పోలీసుల పిలుపు’

KDP: ముద్దనూరు పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ఈరోజు యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, ఆరోగ్యం-భవిష్యత్తుపై ప్రభావం, చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో డ్రగ్ ఫ్రీ జీవనం గడపాలని, అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

February 21, 2026 / 06:00 PM IST

రేణుకా యల్లమ్మను దర్శించుకున్న అనంతపురం ఎంపీ

KRNL: కోసిగి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరేణుకా యల్లమ్మ ఆలయాన్ని శనివారం అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఆలయంలో ఆయన కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 21, 2026 / 06:00 PM IST

సోషల్ మీడియా ద్వారా పాలకుల దృష్టికి సమస్యలు

NLR: సోషల్ మీడియాతో విద్యార్థులు పెడదారిన పడుతున్న సమయంలో అదే వేదికగా తమ సమస్యలు పాలకుల దృష్టికి తీసుకువెళ్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. ఇటీవల కొండాపురం(M) గజ్జలవారిపల్లికి విద్యార్థులు రోడ్డు లేదని SM ద్వారా తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. అదే పందాను అనుసరిస్తూ విద్యార్థులు తమకు రోడ్లు లేవని చేతులెత్తి ముక్కుతూ వీడియో విడుదల చేయడం కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుంది.

February 21, 2026 / 06:00 PM IST

నంద్యాలలో రోడ్డు పనులతో ట్రాఫిక్ సమస్య

నంద్యాలలోని శ్రీనివాస సెంటర్ నుండి సంజీవ నగర్ సర్కిల్ వరకు జరుగుతున్న రహదారి పనుల వల్ల ఇవాళ తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) నేతలు అధికారుల నిర్లక్ష్యాన్ని విమర్శించారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లించాలని కోరారు. పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

February 21, 2026 / 06:00 PM IST

క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేసిన ఎమ్మెల్యే

SKLM: క్రీడలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతి ఇస్తుందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శనివారం సాయంత్రం ఆమదాలవలస మున్సిపాలిటీ జగ్గు శాస్త్ర పేట గ్రామం వద్ద ఉన్న ఎన్టీఆర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో సౌత్ జోన్ నేషనల్ సాఫ్ట్ బాల్ కోచింగ్ క్యాంపెయిన్‌ను స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.

February 21, 2026 / 05:55 PM IST