GNTR: గుంటూరు మిర్చి యార్డ్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం జరగనుంది. నూతన ఛైర్మన్గా కుర్రా అప్పారావు, వైస్ ఛైర్మన్ బిట్రగుంట మల్లిక, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుజ్జనగుండ్ల చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జరిగే కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ ఏర్పాట్లను పెదకూరపాడు MLA భాష్యం ప్రవీణ్ గురువారం పర్యవేక్షించారు.
కృష్ణా: ఈనెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో పాల్గొనే విద్యార్థులకు మొవ్వ క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాల్ టికెట్లను నిన్న పంపిణీ చేశారు. కళాశాల ఇంఛార్జ్ సుధాకర్ మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరంలో జనరల్ కోర్సుకు చెందిన 98 మంది, వృత్తి విద్య కోర్సుకు చెందిన 60 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.
KRNL: దేవనకొండ మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో రేపు ఉదయం 11 గంటలకు ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ జ్యోతి ఇవాళ తెలిపారు. అన్నిశాఖల అధికారులు ప్రగతి నివేదికలతో రావాలని సూచించారు. అలాగే.. సమావేశానికి ప్రజాప్రతి నిధులు హాజరు కావాలని కోరారు.
ELR: పెదవేగి మండలంలోని కూచింపూడి విద్యుత్ ఉపకేంద్రం RDSS పథకం లైన్లు మెరుగుదల పనుల దృష్ట్యా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ అంబేద్కర్ గురువారం తెలిపారు. YSR బొమ్మ రోడ్డు, శూద్ర వారి మెట్టా, నాలుగు పంచాయతీ బోర్లు తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.
ASR: జీ.మాడుగుల మండలం గన్నేరుపుట్టులో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో 4 కుటుంబాలకు చెందిన కాఫీ, మిరియాల తోటలు దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పాంగి సీతన్న, చిన్నమ్మి, భీమన్న, మఠం రాంబాబు అనే రైతులకు చెందిన సుమారు 4 ఎకరాల్లో ఉన్న కాఫీ, మిరియాల తోటల్లో మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
E.G: ఉండ్రాజవరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్ర, శనివారాల్లో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల నిమిత్తం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏపీ ఈపీడీసీఎల్ నిడదవోలు ఎస్ఈ ఎన్. నారాయణ అప్పారావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వేలివెన్ను, కాల్దరిలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి అధికారులకు సహకరించాలన్నారు.
KRNL: జిల్లా కలెక్టర్ ఎ. సిరి గురువారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు గృహ గణన చేపడుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్రంలో మే 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు గృహ గణన చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్కు అవకాశం ఉంది.
కోనసీమ: ముంగండ ZPHS స్కూల్ 10వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందింది. మృతదేహాన్ని స్కూల్ సమీపంలోని మంచినీటి చెరువులో కనుగొన్నారు. సాయంత్రం వరకు స్కూలు ప్రాంగణంలో వాలీబాల్ ఆడిందని సహచర విద్యార్థులు తెలిపారు. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. అనుమానం వచ్చి చెరువును పరిశీలించగా కరుణ మృతదేహం లభ్యమయింది.
AKP: బుచ్చయ్యపేట మండలం థైపురం వద్ద పోలీసులు మెరుపు దాడి చేసి భారీ పేకాట స్థావరాన్ని ఛిన్నభిన్నం చేశారు. ఈ దాడిలో 14 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.5,600 నగదు, మూడు కార్లు, రెండు బైకులు, 14 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో 11 మంది పాత నేరస్థులని, ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
AKP: మునగపాకలో కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ ఎస్.రాము తెలిపారు. ఈ మేరకు గురువారం ఆలయంలో పెళ్లిరాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు కళ్యాణం, మధ్యాహ్నం అన్న సమారాధన, సాయంత్రం ఊరేగింపు ఉంటుందన్నారు.
SS: కదిరి సబ్ డివిజన్ వ్యాప్తంగా పేకాట కేంద్రాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. గురువారం తలుపుల మండలంలోని గుండువారిపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్సై చెన్నయ్య సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 12,650 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
E.G: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కడియంకు చెందిన రాష్ట్ర వైసీపీ కార్యదర్శి గిరజాల బాబు గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు అప్ప చెప్పిన పార్టీ యొక్క బాధ్యతలు, పరిస్థితులు జగన్తో చర్చించారు. ప్రజా సమస్యల కొరకు పోరాడుతూ, కార్యకర్తలకు అండదండలు అందించాలని సూచించారు.
VZM: దేశపాత్రునిపాలెం వద్ద ఈనెల 2న రాత్రి గోకాడ పద్మ మృతికి కారణమైన కారును సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించామని కొత్తవలస సీఐ షణ్ముఖరావు గురువారం తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో పాలకేంద్రం మూసేసి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె ఘటనా స్థలంలో మృతి చెందారు. ఏ.ఎస్.ఆర్. జిల్లాకు చెందిన కారు యాజమానిపై కేసు నమోదు చేశామన్నారు.
ELR: జిల్లా కామవరపుకోట గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణంలో స్టాక్ నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఇతరులకు మద్యాన్ని విక్రయించాలని సూచించారు. అధిక ధరలకు మద్యాన్ని విక్రయించకూడదని పేర్కొన్నారు.
కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణా,అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గుడివాడలో వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ నిన్న వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సీ (RC), పొల్యూషన్, ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.