KRNL: ప్రజల సహకారం లేకుంటే ఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయలేమని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తీసుకురావాలంటే వారి సహకారం అవసరమని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. శనివారం బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి – ఇందిరమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్కు వ్యతిరేకంగా మెగా ర్యాలీని నిర్వహించారు.
ప్రకాశం: ఒంగోలు నగరంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతి ప్రవేశ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసిన విద్యార్థుల హాల్ టికెట్లు ఆన్లైన్ ద్వారా పొందవచ్చని ప్రిన్సిపల్ వీకే గీతాలక్ష్మి తెలిపారు. జనవరి 18న ఉదయం 11 గంటలకు ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 9951091988 నంబరును సంప్రదించాలని సూచించారు.
ప్రకాశం: ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని పీఎం సూర్యఘర్ పథకం అమలుపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సౌర విద్యుత్ వినియోగం పెంచేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. 5వేలకు పైగా జనాభా ఉండి, సౌర విద్యుత్ వినియోగించే గ్రామాలను గుర్తించాలని ఆదేశించారు.
ప్రకాశం: యర్రగొండపాలెం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని నిరుద్యోగులు గమనించి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
BPT: బల్లికురవ మండలంలోని ఈర్లకొండ సమీపంలో గ్రానైట్ లారీ మరమ్మతులకు గురికావడంతో రోడ్డుపై నిలిపారు. అదే దారిలో బైక్పై వెళ్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణా: డిప్యూటీ సీఎం పర్యటనలో నకిలీ పోలీస్ అధికారి హల్చల్ ఘటనపై పెనమలూరు జనసేన పార్టీ ఇంఛార్జ్ ముప్పా రాజా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ప్రత్యేక సెక్యూరిటీని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
SKLM: పాతపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి యు. సాయికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. AP రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధి కల్పనలో భాగంగా పదవ, ఇంటర్, డీగ్రీ పూర్తిచేసి, 18 – 35 ఏళ్లు వయసు గల యవతీ,యువకులు జాబ్మేళాకు హాజరు కావాలన్నారు.
SKLM: శ్రీకాకుళం టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి గంజాయి వినియోగం, పేకాట శిబిరాలు, చైన్ స్నాచింగ్, బహరింగ ప్రదేశాల్లో మద్యం సేవించి న్యూసెన్స్ సృష్టించే వారిపై నిఘా ఉంచనున్నట్లు శనివారం సీఐ ఈశ్వరరావు తెలిపారు. ఈ మేరకు నగరంలో పలు ప్రాంతాలతో పాటు కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రోన్ టెక్నాలజీ సహాయంతో పరిశీలించామన్నారు.
ప్రకాశం: ఒంగోలు నగరపాలక సంస్థలో ఉన్న ఎన్టీఆర్ భరోసా ఫించన్ లబ్దిదారులకు ఈ నెల 31, జనవరి రెండో తేదీన పింఛన్ నగదు పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఒకటో తేదీ నూతన సంవత్సరం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరోజు ముందే పంపిణీ చేపడతామన్నారు. వార్డు సచి వాలయ, నగరపాలక సిబ్బంది ఉదయం 5.30 నుంచి ఇళ్ల వద్దకు వెళ్లి నగదు పంపిణీ చేస్తారన్నారు.
NTR: కూటమి హయాంలో తిరువూరు మండల పరిధిలోని కొత్తపల్లి-శ్రీనికేతన్ రోడ్డుకు మరమ్మతులు చేశామని శనివారం టీడీపీ తమ అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది. గతంలో ఈ రోడ్డు గుంతులతో నిండిపోయి అధ్వాన్నంగా ఉండేదని టీడీపీ ఆరోపించింది. జగన్ పాలనలోని ఐదేళ్ల నరకయాతన నుంచి గోతులతో నిండిన రహదారులకు విముక్తి కల్పించామని ఈ మేరకు Xలో పేర్కొంది.
VZM: దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం పోలీస్ స్టేషన్ను డీఎస్పీ పి. శ్రీనివాసరావు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేసి పలు సూచనలను సిబ్బందికి అందజేశారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. గంజాయి అక్రమ రవాణాపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని ఆదేశించారు. వాహనాల తనిఖీలు చేపట్టి నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.
కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్రను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం మచిలీపట్నంలో మంత్రి నివాసంలో స్పీకర్ కలిశారు. ఇటీవల కొల్లు సోదరుడు కొల్లు వెంకట రమణ అకాల మరణం పట్ల సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర అయ్యన్నపాత్రుడిని శాలువాతో సత్కరించారు. అనంతరం పలు అంశాలపై వారు చర్చించుకున్నారు.
TPT: వరదయ్యపాలెం మండలం కారిపాకంలో గంజాయి అమ్ముతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై మల్లికార్జున్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. పక్కా సమాచారంతో దాడి చేసి రూ.72 వేలు విలువైన 6 కేజీల గంజాయి, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులు విఘ్నేష్, అరసు, అజిత్ కుమార్, నరేంద్ర, సురేశ్, రాజాను రిమాండ్కు తరలించామన్నారు.
ELR: పోలీసు నియామక పరీక్షలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సివిల్ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి ఏలూరులోని పోలీస్ పరేడ్ మైదానంలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
ATP: తాడిపత్రిలోని పౌరసరఫరాల స్టాక్ పాయింట్పై ఆరోపణలు రావడంతో జిల్లా అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. సివిల్ సప్లై డీఎం రమేశ్ క్షేత్రస్థాయికి చేరుకుని గోడౌన్లో ఎంత సరుకు ఉందో పరిశీలిస్తుండగా రేషన్ డీలర్లు కంది ప్యాకెట్లు ఇచ్చారు. అందులో కేవలం గాలి మాత్రమే ఉందని, కందిబెడలు లేవని చెప్పడంతో ప్యాకెట్ చూసి అధికారులు అవాక్కయ్యారు.