• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మారేమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

NDL: నంది కొట్కూరు మండలo, వడ్డెమానులో మారేమ్మ నూతన గుడిప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎమ్మెల్య జయసూర్య, మాండ్ర శివానంద రెడ్డి హాజరయ్యారు. ముందు తల్లి మారేమ్మ ను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ సర్పంచి దామోదర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 07:25 PM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఐ

శ్రీకాకుళంలోని జి.టి.రోడ్డులోని జామియా మసీదులో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో వన్‌ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పైడిపు నాయుడు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని సీఐ తెలిపారు. అలాగే, ముస్లిం భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రశంసనీయమని కొనియాడారు.

February 22, 2026 / 07:24 PM IST

రక్షణ శాఖ మంత్రిని కలిసిన డీసీసీ బ్యాంక్ ఛైర్మన్

KDP: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్‌ను ఆయన నివాసంలో బద్వేల్‌కు చెందిన డీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి శాలువా, పూల బొకే అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగినట్లు ఆయన తెలిపారు.

February 22, 2026 / 07:24 PM IST

‘శాలరీ కాలిక్యులేటర్’ పేరుతో కొత్త సైబర్ మోసాలు: ఏస్పీ

కర్నూలు: ఎనిమిదో వేతన సంఘంనేపథ్యంలో జీతాల పెరుగుదల పై చర్చలు జరుగుతున్న వేళ, సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకుని 8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్ పేరుతో వాట్సాప్ సందేశాలు పంపుతూ మోసగాళ్లు అమాయక ప్రజలను వలలో వేస్తున్నారన్నారు.

February 22, 2026 / 07:23 PM IST

నరసాపురంలో బాలోత్సవం

W.G: పిల్లలలో సృజనాత్మక శక్తిని ప్రోత్సహించడానికి మార్చి 1న నరసాపురం బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి పూరిళ్ళ శ్రీనివాస్ తెలిపారు. మార్చి 1న వైఎన్ కాలేజీలో పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, స్పాట్ డ్రాయింగ్, వ్యాసరచన, తెలుగు కథారచన, దేశభక్తి, అభ్యుదయ గీతాలాపన, జానపద నృత్యం, క్లాసికల్ డ్యాన్స్ నిర్వహిస్తామన్నారు

February 22, 2026 / 07:20 PM IST

64 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్: ఎస్పీ

ATP: జిల్లాలో రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు ఎస్పీ పి. జగదీష్ ఆదివారం తెలిపారు. 64 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరిసర ప్రాంతాలను సైలెంట్ జోన్లుగా ప్రకటించామన్నారు. పరీక్ష పత్రాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 22, 2026 / 07:20 PM IST

భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

VZM: బొబ్బిలి కుమ్మరివీధిలో నివాసం ఉంటున్న మర్రి మాధవిదేవి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. మాధవి చైతన్య పాఠశాలలో గణితం టీచర్‌గా పని చేస్తున్నట్లు తెలిపారు. కొంతకాలంగా ఆమెను భర్త నరేష్ అనుమానంతో వేధిస్తున్నాడని పేర్కొన్నారు. నీవు చనిపోతేనే దరిద్రం పోతుందని పదే పదే అనడంతో మనస్తాపానికి గురైన మాధవి శనివారం రాత్రి ఉరివేసుకుందని ఆమె తల్లి ఫిర్యాదు చేశారు.

February 22, 2026 / 07:20 PM IST

‘జర్నలిస్టులు వాస్తవాలు బయటికి తీయాలి’

AKP: మాడుగుల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెస్ క్లబ్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. జర్నలిస్టులు వాస్తవాలను వెలికి తీసే విధంగా పని చేయాలని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

February 22, 2026 / 07:17 PM IST

మారెమ్మ ఆలయంలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ

సత్యసాయి: మడకశిర మండలం కల్లుమరి గ్రామంలో మారెమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు సతీమణి ఎం.ఎస్. ఉమాదేవి పాల్గొన్నారు. గ్రామ మహిళలు ఆమెకు ఘనస్వాగతం పలకగా, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

February 22, 2026 / 07:16 PM IST

పాలకొల్లు ప్రధాన కాలువలో మురుగు

W.G: పాలకొల్లులోని ప్రధాన కాలువలోకి దశాబ్దాలుగా చెత్తాచెదారం చేరుతోందని, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దిగువ గ్రామాల సర్పంచులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ వదిలేసిన మురుగు పంట కాలువల్లో కలిసి తమ గ్రామాలకు వస్తోందని, తాము విషం తాగుతున్నామంటూ గత మండల సర్వసభ్య సమావేశాల్లోనూ ఆవేదన వ్యక్తం చేశారు.

February 22, 2026 / 07:15 PM IST

రాయచోటిలో MYTDP యాప్ పోస్టర్ ఆవిష్కరణ

అన్నమయ్య: రాయచోటి పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధికార యాప్ MYTDP పోస్టర్‌ను రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు మౌర్యా రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మౌర్యా రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలందరూ MYTDP యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ కావాలని పిలుపునిచ్చారు.పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 22, 2026 / 07:12 PM IST

అష్టలక్ష్మీ దేవాలయంలో రష్యా పర్యాటకులు

విశాఖ అన్నంరాజునగర్‌లోని శ్రీ అష్టలక్ష్మీ దేవాలయాన్ని ఆదివారం రష్యా దేశస్తులు సందర్శించారు. భారతదేశంలోని ప్రముఖ ఆలయాలపై అధ్యయనం చేస్తున్న భాగంగా ఈ దేవాలయాన్ని దర్శించుకున్నట్లు తెలిపారు. ఆలయంలో శివకేశవుల విగ్రహాల నిర్మాణం అద్భుతంగా ఉందని, ముఖ్యంగా వీణ ధరించిన అమ్మవారి రూపం తమను ఆకట్టుకుందని పేర్కొన్నారు.

February 22, 2026 / 07:07 PM IST

రేపు చిత్తూరు కలెక్టరేట్‌లో PGRS

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ‘PGRS’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉ.10 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆయన ఆదేశించారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

February 22, 2026 / 07:05 PM IST

ఎమ్మిగనూరు ఎమ్మెల్యేను కలిసిన బార్ సంఘం

KRNL: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డిని బార్ అసోసియేషన్ అధ్యక్షులు రషిదుల్లా బృందం మర్యాదపూర్వకంగా ఇవాళ కలిశారు. అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ గా ఎన్నికైన సందర్భంగా రషీదుల్లా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా సబ్ కోర్టు భవన నిర్మాణానికి నిధుల అనుమతి,గోనెగండ్లను ఎమ్మిగనూరు కోర్టు పరిధిలోకి తీసుకురావాలని కోరారు.

February 22, 2026 / 07:04 PM IST

వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే సునీత

ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె స్వయంగా అర్జీలు స్వీకరించారు. సాగునీరు, మౌలిక వసతులు, ఇతర వ్యక్తిగత సమస్యలపై విన్నపాలు అందాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా న్యాయం జరిగేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు.

February 22, 2026 / 07:00 PM IST