పవన్ కళ్యాణ్పై ఓ వ్యక్తి చెప్పు దాడికి యత్నించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో అది ఇప్పటి వీడియో కాదని, కొందరు కావాలనే పవన్ కళ్యాణ్పై ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన కార్యకర్తలు క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని జనసైనికులు హెచ్చరించారు.
విశాఖ నుంచి పాలనకు అన్ని ఏర్పాట్లను వైసీపీ సర్కార్ పూర్తి చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని శాఖలు అక్కడికి తరలి వెళ్లాయి. తాజాగా మిగిలిన అన్ని శాఖలకు సంబంధించి భవనాలను కేటాయించాలని జీవో జారీ అయ్యింది. అందుకోసం ప్రత్యేక కమిటీని కూడా సీఎం జగన్ సర్కార్ ఏర్పాటు చేసింది.
చంద్రబాబు అసలు ఎక్సైజ్ శాఖ చూడలేదు, ఆ ఫైలుపై సంతకం చేయలేదని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. జగన్ కుట్రకోణంలో భాగంగానే మరో తప్పుడు కేసు పెట్టారని విమర్శించారు.
ఓ విద్యార్థిని ప్రేమిస్తున్నానని టీచర్ మోసం చేశాడు. ఇంటికి తీసుకెళ్లి తాళి కట్టాడు. పెళ్లి అయ్యింది కదా అని.. ఆపై లైంగికదాడి చేశాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.
ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయానే అంశంపై ఎంపీ రఘురామ రాజు హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు సీఎం జగన్ సహా 41 మందికి నోటీసులు జారీ చేసింది.
ఇటివల కాలంలో పెంచుకున్న పెంపుడు జంతువులకు కూడా పుట్టినరోజు వేడుకలు జరిపించడం ట్రెండ్ గా మారుతుంది. వాటిలో శునకాలు, పిల్లి, గాడిద, గుర్రం వంటి వాటికి ఇప్పటికే జరుపగా..ఆ జాబితాలో తాజాగా కోడి కూడా చేరింది. అవునండి బాబు ఇటివల కోడిపుంజుకు బర్త్ డే వేడుకలు ఘనంగా జరిపించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
ఏపీలో మధ్యాహ్న భోజనం తిని 51 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
వైసీపీ మంత్రి రోజా టీడీపీ నేత బండారు సత్యనారాయణపై పరువు నష్టం దావా వేసింది. అలాగే నగరి టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ పేరును కూడా పరువు నష్టం దావా పిటిషన్లో నమోదు చేసింది.
ఈరోజు ఉదయం విశాఖ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ముందు ఉన్న స్కూల్ పిల్లల ఆటోను ఢీ కొట్టింది. దీంతో అందులోని ఏడుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.
ఏపీ ఫైబర్నెట్ కుంభకోణంలో నష్టపోయిన నిందితుల స్థిరాస్తుల అటాచ్మెంట్పై ముందుకు వెళ్లాలని విజయవాడ అవినీతి నిరోధక కోర్టు (ACB Court ) మంగళవారం ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (ap cid)ని ఆదేశించింది.