• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త ..త్వరలో భారీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయడానికి సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలను ఆన్...

January 22, 2023 / 03:45 PM IST

బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక.. మేనమామే కారణం?

కామం మైకంలో వావివరసలు చూడడం లేదు. పిల్లాజెల్లా అని చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అభంశుభం తెలియని చిన్నారులను కూడా దుర్మార్గులు చిదిమేస్తున్నారు. అలా ఒకరు మేనమామ వరుసైన వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడగా.. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర...

January 22, 2023 / 01:44 PM IST

సోమేశ్‌ కుమార్ శాఖపై ప్రభుత్వం తర్జన భర్జన

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ కేడర్‌కు రిపోర్ట్ చేసిన మాజీ సీఎస్‌ సోమేష్ కుమార్ కు పోస్టింగ్‌ ఇచ్చే అంశంపై సమాలోచనలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేసిన సోమేష్ కుమార్‌కు ఏ శాఖను అప్పగించాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందట. వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో మరికొందరు సీని...

January 21, 2023 / 08:46 PM IST

రెండు నెలల్లో పరిపాలన రాజధానిగా విశాఖ: అమర్నాథ్

మరో రెండు నెలల్లో విశాఖ పరిపాలన రాజధాని కానుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ శనివారం తెలిపారు. బీచ్ ఐటీ పేరిట విశాఖలో ఐటీ అభివృద్ధి జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్టమని కాబట్టి ఇతర రాష్ట్రాలతో ఏపీ అభివృద్ధిని పోల్చడం సరికాదన్నారు. టెక్నికల్ గా విభజన నేపధ్యంలో ఏపీ పాత రాష్టమే అయినప్పటికీ..రాజధాని హైదరాబాద్ వంటి ఆర్థిక నగరం తెలంగాణలో ఉన్నందున ఏపీ మళ్లీ కొత్తగా ప్రారంభిం...

January 21, 2023 / 08:00 PM IST

కేసీఆర్ సారీ చెప్పే ఆంధ్రలోకి రావాలి.. లేదంటే అడ్డుకుంటాం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఏపీలోకి అడుగుపెట్టాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆంధ్ర ప్రజలపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు క్షమాపణలు చెప్పాలని తెలిపారు. క్షమాపణ చెప్పకుండా వస్తే ఏపీలో కేసీఆర్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు. విభజన సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయాలని కోరారు. ...

January 21, 2023 / 06:10 PM IST

అయ్యన్నపాత్రుడు సైకో.. శాడిస్ట్: వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్

మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఓ సైకో, శాడిస్ట్ అని వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ విమర్శించారు. అయ్యన్నపాత్రుడి చరిత్ర అందిరికీ తెలుసన్నారు. నర్సీపట్నంను గంజాయి అడ్డాగా మార్చారని ఆరోపించారు. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఈరోజు (శనివారం) విశాఖలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం అయ్యన్నపాత్రుడికి పట్టుకుందన్నారు. అందుకోసమే పార్టీ నేతల ఇళ్లకు తిరుగుతున్నాడని ఎద్ద...

January 21, 2023 / 05:51 PM IST

అనంత శ్రీరామ్ పై పోలీసులకు ఫిర్యాదు

ఏపీ సర్కార్ భట్రాజు పొగడ్తలు అనే పదబంధాన్ని నిషేధించింది. అయితే తాజాగా ఆ పదప్రయోగాన్ని చేసి అనంత శ్రీరామ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల సంక్రాంతి సంబరాల్లో భట్రాజు పదప్రయోగం చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై అనంత శ్రీరామ్ బహిరంగ క్షమాపణ చెప్పారు. భట్రాజు కులసంఘాలు ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా అనంత శ్రీరామ్ పై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పాలకొల్లులో సంక్రాంతి సంబరాలు జరుగుతుండ...

January 21, 2023 / 03:40 PM IST

ఫిబ్రవరిలోనే ఏపీ బడ్జెట్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. సాధారణంగా మార్చిలో బడ్జెట్ సమావేశాలను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నిర్వహించాలని, అది కూడా 20 రోజుల పాటు సెషన్స్ నిర్వహించాలని జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, ఆ తర్వాత 28, 29 తేదీల్లో జీ-20 వర్కింగ్ గ్రూప్ సదస్సు జరగబోతోంది. వీటిని దృష్టిలో ఉం...

January 21, 2023 / 01:47 PM IST

చిరు కూతురు శ్రీజ ఎమోషనల్..14 ఏళ్ల అనుబంధం అంటూ

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన పెళ్లి గురించో, ఇతర విషయం గురించి చేయలేదు. కాఫీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఆమె ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకోగా, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, తనతో కాఫీ ఉందని పేర్కొంది. ఈ మేరకు ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశారు. 14 ఏళ్ల నుంచి తనకే కాఫీ తాగే అలవాటు ఉందని వివరించారు. ఆ వీడియో వైరల్ అవుతుంది. […]

January 21, 2023 / 01:34 PM IST

గ్రాండ్‌గా ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్!

డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఒక వీరాభిమానిగా.. బాలయ్యను తెరపై ఎలా చూపించాలో.. అలా చూపించాడు. దాంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అఖండ, అన్‌స్టాపబుల్‌ జోష్‌లో ఉన్న బాలయ్యతో పాటు.. ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపాడు వీరసింహారెడ్డి. దాంతో సంక్రాంతికి థియేటర్ల వద్ద మాస్ జాతర జరిగింది. అందుకే బాక్సాఫీస్ దగ్గర వీరసింహుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. యాక్షన్, సెంటిమెంట్‌తో ఊచకోత కోస్తున్నాడు. జనవరి 12న...

January 21, 2023 / 12:53 PM IST

తిరుమల డ్రోన్ వీడియోపై వైవీ స్పందన

ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక, పుణ్య క్షేత్రం తిరుమల ఆలయాన్ని డ్రోన్లతో చిత్రీకరించిన అంశం పైన టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమల డ్రోన్ వీడియో వైరల్ గా మారింది. అత్యంత భద్రత ఉండే తిరుమలపై డ్రోన్లతో వీడియోను చిత్రీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీటీడీ బోర్డుపై విమర్శలు వచ్చాయి. దీంతో సుబ్బారెడ్డి స్పందించారు. ఆనంద గోపురంపై చిత్రీకరణలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. స...

January 21, 2023 / 12:25 PM IST

కేటీఆర్ ను చూసి ఏపీ మంత్రి నేర్చుకోవాలి: అయ్యన్నపాత్రుడు

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికొక ఐటీ శాఖ మంత్రి ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. ఆయన ఐటీ మంత్రి అయ్యాక ఏపీకి ఒక్క పరిశ్రమ వచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను తిట్టడానికే అమర్ నాథ్ లాంటి వాళ్లు మంత్రులుగా అయ్యారని తెలిపారు. ఆయన తిట్టడానికి తప్ప పరిశ్రమలు తీసుకురావడానికి పనిక...

January 20, 2023 / 09:58 PM IST

అది ఫేక్ వీడియో అంటూ టీటీడీ ఈవో ప్రకటన

తిరుమల పుణ్యక్షేత్రంలో ఏరియల్ ఫుటేజీతో కూడిన ఓ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అదొక ఫేక్ వీడియో అని, తిరుమలలో డ్రోన్లకు అనుమతి లేదని వెల్లడించారు. తిరుమల ఎప్పుడూ సాయుధ బలగాల పర్యవేక్షణలో ఉంటుందని, శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగురవేయడం అసాధ్యమని ఈవో తెలిపారు. వైరల్ అవుతున్న వీడియో 3డీ ఇమేజీ లేదా గూగుల్ లైవ్ వీడియో అయ్యుంటుందని ఈవో ...

January 20, 2023 / 09:36 PM IST

శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ వీడియో వైరల్

కళియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల శ్రీవారిని కొలుస్తారు. తిరుమలలో డ్రోన్ కెమెరాల వినియోగంపై నిషేధం ఎప్పటినుంచో ఉంది. తాజాగా తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆలయ డ్రోన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. https://www.instagram.com/p/CnoiirOB1vW/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again ఆ వీడియో ఇన్ స్టాగ్రామ్ పేజీ ఐకాన్ అనే అకౌం...

January 20, 2023 / 09:17 PM IST

జీవో నెం.1పై సుప్రీం కోర్టు నిర్ణయం సరైనదే : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.1 ని హైకోర్టు సస్పెండ్ చేయగా.. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తాజాగా సుప్రీం కోర్టు దీనిపై స్పందించింది. ఈ జీవో విషయంలో తాము  జోక్యం చేసుకోమంటూ తేల్చి చెప్పింది. సుప్రీం నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. హైకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. తప్పుడు నిర్ణయాలతో ప్రజాధనాన్ని ...

January 20, 2023 / 07:21 PM IST