• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

టీడీపీ పార్టీ ఇంఛార్జ్ కలిసిన మంత్రి

KRNL: విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర మర్యాద పూర్వకంగా ఆలూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంఛార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతిని ఇవాళ కలిశారు. కలిసిన సందర్భంలో పార్టీ కార్యాలయంలో అవగాహన చర్చలు నిర్వహించారు. రాజకీయ, సామాజిక విషయాలపై పరస్పర అభిప్రాయాలు మార్చుకున్నారు.

February 24, 2026 / 05:47 PM IST

ఉండి నూతన వీ‌ఆర్‌ఓ‌ల సంఘం ఎన్నిక

W.G: ఉండి మండలం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఉండి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఎన్నిక జరిగిట్టు కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు S.చిన్నారావు తెలిపారు.ఆయన కార్యవర్గ వివరాలుఅందజేశారు.ఉపాధక్షులుగాD.వెంకటేశ్వర్ల,కా ర్యదర్శిగా CH. విజయలక్ష్మి , సంయుక్త కార్యదర్శిగా V. D. కృపాంజలి , కోశాధికారీగా B. శ్రీనివాసరావు ఎన్నికైనట్టు తెలిపారు.

February 24, 2026 / 05:47 PM IST

రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలవాలి: శ్రీరామ్

సత్యసాయి: రైతులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా నిలవాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రెసిడెంట్, డైరెక్టర్లకు ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ సూచించారు. తాడిమర్రి పీఏసీఎస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు బసికొండ రవీంద్ర, నాగార్జున రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం పరిటాల శ్రీరామ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 05:46 PM IST

జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన అరకు విద్యార్ధిని

ASR: అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 2nd B.Com విద్యార్థిని తామల జ్యోతిక జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ చలపతిరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జ్యోతికను సత్కరించారు. ఈనెల 17, 18 తేదీలలో రాంచిలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్‌లో జ్యోతిక జావెలిన్‌త్రో విభాగంలో ద్వితీయ స్థానం సాధించి జాతీయ పోటీలకు అర్హత సాధించింది.

February 24, 2026 / 05:43 PM IST

భవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన మాదక ద్రవ్యాలను సురక్షితంగా భద్రపర్చేందుకు పాత కలెక్టర్ కార్యాలయం నందు ఉన్న భవనాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పరిశీలించారు. గిరింపేటలో ఉన్న పాత కలెక్టరేట్లో టౌన్ ప్లానింగ్ విభాగంలోని హాలును పరిశీలించారు. భవనంలో అవసరమైన మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు.

February 24, 2026 / 05:43 PM IST

మర్రిపాడులో ప్రారంభమైన ఎల్లమ్మ తల్లి జాతర

SKLM: సంతబొమ్మాలి మండలం మర్రిపాడులో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవం మంగళవారం ప్రారంభమైంది. ఈ యాత్ర మంగళవారం నుండి గురువారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. గురువారం అమ్మవారు ఎల్లమ్మ తల్లి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. నౌపడ ఎస్సై నారాయణస్వామి జాతరకి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

February 24, 2026 / 05:38 PM IST

దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుల సతీమణి మృతి

కృష్ణా: జిల్లా ఆదిమాంద్ర సంఘం అధ్యక్షులు, దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు పొంగులేటి జయరాజు సతీమణి విజయలక్ష్మి మంగళవారం మృతి చెందారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విజయలక్ష్మి, నేడు విజయవాడలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. విజయలక్ష్మి మరణంతో, జయరాజుకు పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు, దళిత సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

February 24, 2026 / 05:37 PM IST

’28న కరప మండల పరిషత్ సర్వసభ్య సమావేశం’

KKD: కరప మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జె. శ్రీనివాస్ తెలిపారు. ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి సత్తిబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఎజెండాతో పాటు ఇతర అభివృద్ధి అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని, మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో రావాలన్నారు.

February 24, 2026 / 05:35 PM IST

‘విద్యార్థులు తమ లక్ష్యాలతో ముందుకు సాగాలి’

ATP: పెద్దవడుగూరు మండల కేంద్రంలోని గేట్స్ కళాశాలలో ‘నెలనెలా విలువల వెన్నెల’ అనే అంశంపై మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ గాయకుడు ఎస్ కే లెనిన్ బాబు హాజరయ్యారు. సంకల్పం అంకితభావం, కృషి అనే అంశాలపై విద్యార్థులకు తన అనుభవాలను జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లను, విజయ రహస్యాలను వివరించారు.

February 24, 2026 / 05:35 PM IST

జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీమంత్రి

NTR: ఇటీవల ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులతో దాడి చేసిన జోగి రమేష్ నివాసాన్ని మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మంగళవారం సందర్శించారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, ఈ ఘటనకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

February 24, 2026 / 05:32 PM IST

‘స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి’

KRNL: పెద్దకడబూరు మండలం మేకడోణ గ్రామంలో ఉన్న ముస్లిం మైనారిటీలకు స్మశాన వాటిక కోసం స్థలం చూపించాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ఐ జెర్మియాకు వినతిపత్రం అందజేశారు. ఈ ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, మండల నాయకులు జాఫర్ ఖాన్ పటేల్ మాట్లాడుతూ ముస్లీంలకు స్మశాన వాటికకు సరియైన స్థలం లేక ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.

February 24, 2026 / 05:32 PM IST

మహిళల సమస్యలపై వర్సిటీ వీసీలతో రాయపాటి శైలజ సమీక్ష

GNTR: విశ్వవిద్యాలయాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. మంగళవారం మంగళగిరిలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వర్సిటీల వీసీలతో ఆమె వర్చువల్ సమావేశం నిర్వహించారు. ‘క్యాంపస్ అంబాసిడర్’ కార్యక్రమం అమలుతో పాటు, విద్యార్థినుల సవాళ్లపై పరిశోధనలు చేయాలని ఆమె సూచించారు.

February 24, 2026 / 05:30 PM IST

జనగణన-2027 రాజ్యాంగబద్ధమైనది: కలెక్టర్

NLR: సాధారణ కోవిడ్, కుటుంబ సర్వేల కన్నా, జనగణన-2027 సర్వే రాజ్యాంగబద్ధమైనదని దానిని క్రమ పద్ధతిలో నిర్వహించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలోని హరినాధపురంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

February 24, 2026 / 05:30 PM IST

మార్చి 3న విఘ్నేశ్వరుని ఆలయం మూసివేత

కోనసీమ: మార్చి 3వ తేదీ మంగళవారం చంద్రగ్రహణం కారణంగా అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు స్వామి వారికి చేసే అన్ని సేవలు ఉదయం 9 గంటల వరకు మాత్రమే జరుగుతాయని, 9.30 గంటల నుంచి ఆలయం మూసివేస్తామని పేర్కొన్నారు. మరునాడు ఉదయం సంప్రోక్షణ అనంతరం దర్శనాలు ఉంటాయన్నారు.

February 24, 2026 / 05:30 PM IST

‘భూసేకరణ వేగవంతం చేయాలి’

VZM: జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో తారకరామ తీర్థసాగర్, తోటపల్లి, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు తదితర పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే ఎయిర్‌పోర్ట్ భూ సేకరణ పూర్తి కావాలన్నారు.

February 24, 2026 / 05:29 PM IST