SKLM: ఆమదాలవలస మండలంలోని ఆర్ఆర్ కాలనీలో హత్యకు గురైన మహిళ కేసులోని నిండుతుడు సొండి సురేష్ను పోలీసులు నేడు అదుపులోకి తీసుకున్నారు. సంగమేశ్వర స్వామి కొండపైన ఉన్న నిందితుడు ఆదివారం అర్ధరాత్రి పోలీసులకు దొరక్కుండా నానా అగచాట్లకు గురిచేసి చివరకు కొండ దిగువ భాగాన భవానీ సన్నిధానం వద్ద పోలీసులకు చిక్కినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు.
SKLM: కొత్తూరు మండలం జగన్నాథపేట సమీపంలో పంట పొలాల్లో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 30 బస్తాల ధాన్యం దగ్ధమైంది. ఇదే మండలం బలద గ్రామానికి చెందిన పూర్ణచంద్ర పాణిగ్రాహి రైతు పొలంలో ధాన్యం బస్తాలను ఉంచారు. గుర్తుతెలియని వ్యక్తులు పొలానికి నిప్పు పెట్టడంతో అగ్ని మంటలు ఎగసిపడి ధాన్యం బస్తాలు కాలిపోయాయి. ఆస్ఐ, గ్రామ పెద్దలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
SKLM: అక్రమంగా నాటుసారా ప్యాకెట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను నేడు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 36 లీటర్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ కె.బేబి తెలిపారు. కంచిలి మండలం బీపీ కాలనీకి చెందిన ఎస్. మహేష్, మున్సిపేటకు చెందిన కె.మోహనరావులు 36 లీటర్ల నాటు సారా ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేశారు.
NLR: 15వ ఆర్థిక సంఘం నిధులలో ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థలకు మొదటి విడత అందించిన నిధులు ఎన్ని అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. నిధులు విడుదలైన విషయం వాస్తవం అయితే ఆంధ్రప్రదేశ్కు విడుదల చేసిన టైడ్, అన్ టైడ్ గ్రాంట్ల వివరాలు తెలియజేయాలని కోరారు. ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి సమాధానమిచ్చారు.
కృష్ణా: ఆగిరిపల్లి మండలం సగ్గూరు గ్రామంలో అనుమానం పెనుభూతమై భార్యను భర్త హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కార్మికుడు లాము రమేశ్ తన భార్య మనీషా (27)ను గొంతు నులిమి హత్య చేసినట్లు ఎస్సై శుభ శేఖర్ తెలిపారు. సోమవారం జరిగిన ఘటన మృతురాలి అన్న యేసురత్నం తెలుసుకొని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
KRNL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనానికి అర్చకులు బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. మూల బృందావనానికి అర్చకులు సుప్రభాత సేవ, వివిధ రకాల ఫలాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బంగారు కవచాలు, వివిధ రకాల పూలు, పట్టు వస్త్రాలతో బృందావనాన్ని అలంకరించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు ఇచ్చారు.
విశాఖ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఢిల్లీకి చెందిన మహమ్మద్ ముజామ్మిల్ గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద తనిఖీ చేయగా 12 కిలోల గంజాయి లభించినట్లు రైల్వే ఎస్ఐ అబ్దుల్ మారూఫ్ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.
శ్రీకాకుళం రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని గుంతకల్లు నుండి డివిజన్లో భద్రతకు సంబంధించిన పనులు కారణంగా పలు రైళ్లను దారి మళ్ళిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పూరి-యశ్వంత్పూర్(22883) గరీబ్రత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ డిసెంబర్ 20 నుండి మళ్లించిన మార్గంలో నడుస్తుందని తెలిపింది.
NLR: రాపూరు మండలంలోని కండలేరు జలాశయంలో బుధవారం ఉదయం 6 గంటలకు 82.590 మీటర్ల నీటిమట్టానికి 56.656 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ మేరకు అధికారులు తాజా బులెటిన్ విడుదల చేశారు. సత్య సాయి గంగ కాలువకు 850, మొదటి బ్రాంచ్ కాలువకు 70, లోలెవెల్ స్లూయిజ్కు 10 క్యూసెక్కుల సాగునీరు విడుదల అవుతోందని ఏఈ తిరుమలయ్య తెలిపారు.
PPM: 44వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో ప్రతిభ కనబర్చిన కానిస్టేబుల్ అల్లు రామకృష్ణను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి రాత్రి అభినందించారు. స్పెషల్ పార్టీలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణను ఎస్పీతో పాటు సిబ్బంది అభినందిస్తున్నారు. ఈ క్రీడలనను కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించారు.
CTR: రామచంద్రాపురం మండలం సి.రామాపురం దగ్గర ఉన్న శ్రీబ్రహ్మశ్రీ గురుజీ ఆశ్రమంలో శ్రీ అష్టలక్ష్మి పూజలు జరుగుతున్నాయి. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మంగళవారం రాత్రి ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీబ్రహ్మశ్రీ గురుజీ ఆశీర్వాదం తీసుకున్నారు. వీరేంద్ర సెహ్వాగ్కు ఆశ్రమ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
NLR: సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు వైపు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న సిమెంటు లారీ.. బద్వేల్ నుంచి నెల్లూరుకి వెళ్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను వెంటనే 108లో ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు.
NLR: స్కిల్ స్కామ్లో చంద్రబాబే అసలు సూత్రధారి అని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళగిరి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. చంద్రబాబు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో సీమెన్స్ కంపెనీకి ఇచ్చిన సొమ్ము అంతా షెల్ కంపెనీల ద్వారా తిరిగి చంద్రబాబుకే చేరేటట్టు చేశారన్నారు.
VSP: హుకుంపేట మండలంలోని రాప పంచాయతి పరిధి లివిటీ గ్రామంలో మంగళవారం రచ్చబండ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి పంచాయితీ ఉప సర్పంచ్ మోహన్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రచ్చబండ నిర్మాణం చేపట్టనుండడంతో లివిటీ గ్రామంలో గిరిజనుల రచ్చబండ కష్టాలు తీరనుందన్నారు.
ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం మైదానంలో ఈ నెల 19 నుంచి రెండు రోజుల పాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థాయి జూడో బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎంఆర్డీ బలరామ్, మార్లపూడి బాలరాజు మంగళవారం తెలిపారు. పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 20 నుంచి 22 వరకు గుంటూరు ఏఎన్ యూలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు.