GNTR: తెలుగు వారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా అమరావతిలో ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, భాష, సాహిత్యం, కళలు, చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. శనివారం ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై సీఎం సమీక్ష నిర్వహించారు.
GNTR: తెనాలిలోని పాత స్వరాజ్ టాకీస్-ముత్యంశెట్టిపాలెం వెళ్లే మలుపు వద్ద భారీ వృక్షం కూలిపోయింది. నిన్న కురిసిన భారీ వర్షానికి చెట్టు కింది భాగం పూర్తిగా నాని రాత్రి విరిగిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో అటుగా వెళ్తున్న మినీ లారీ మీద చెట్టు కొమ్మలు పడటంతో అద్దం స్వల్పంగా ధ్వంసం అయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
SKLM: ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం నగరంలో శనివారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఏడు రోడ్లు జంక్షన్ రహదారి సమీపంలో ట్రాఫిక్ సీఐ నాగరాజు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పలు వాహనాలను తనిఖీలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు గురించి అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడపే వాహనదారులను హెచ్చరించారు.
ELR: పెదవాగు రిజర్వాయర్కు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏలూరు కలెక్టరేట్లో 1800-233-1077, 94910 41419, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఆఫీస్లో 83092 69056, వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో 8328696546 మూడు చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి శనివారం తెలిపారు. అత్యవసర సమయంలో ఈ నంబర్లను సంప్రదించాలని కోరారు.
గుంటూరు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం తెలిపారు. సహాయం కోసం 0863-2234014 నంబరులో సంప్రదించాలన్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బందిని విధులు నిర్వహించేలా నియమించామని ఆమె పేర్కొన్నారు. ప్రజలు సమస్యలు తెలియజేస్తే అధికారులు వెంటనే సహాయం అందిస్తారని వెల్లడించారు.
అన్నమయ్య: కోడూరు మండలం అనంతరాజుపేట గ్రామం వద్ద శనివారం జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమ గంజాయి రవాణాను అడ్డుకుని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై కోడూరు ఎక్సైజ్ శాఖ అధికారులను వివరణ కోరగా.. దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
GNTR: జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 11,388 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా కోర్టులో 16 బెంచీలు, 12 మండల కేంద్రాలలో 25 బెంచీలను ఏర్పాటు చేసి రాజీకి అవకాశం ఉన్న కేసులతోపాటు ముందస్తు వివాదాలకు సంబంధించిన 908 సివిల్, 10,480 క్రిమినల్ కేసులు పరిష్కారం అయినట్లు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ చక్రవర్తి తెలిపారు.
GNTR: నగరంలోని రింగ్ రోడ్ వద్ద MMK యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షష్టమ గణపతి మహోత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన 111 కేజీల భారీ లడ్డూ వేలం పాట ఉత్సాహభరితంగా సాగింది. ఈ వేలంలో వట్టికూటి.జ్యోతి వంశీ ఫ్రెండ్స్ సర్కిల్ రూ.15,66,666 అత్యధిక ధరకు లడ్డూను దక్కించుకున్నారు.
సత్యసాయి: కదిరి కూటాగుళ్ల రైల్వే గేట్ సమీపంలో లాటరీ టికెట్లు అమ్ముతూ, నాటుసారా విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, మరో ఆరుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారని సీఐ నారాయణరెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుంచి 16 లీటర్ల నాటుసారా, 47 లాటరీ టికెట్లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుచేయగా న్యాయమూర్తి రిమాండు విధించారు.
ప్రకాశం: జాతీయ పశువ్యాధుల నియంత్రణ పథకం కింద, ఒంగోలు జిల్లా వ్యాప్తంగా ఈనెల 15వ తేదీ నుంచి నెల రోజులపాటు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. శనివారం ఆయన ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. పశువులకు సోకే ప్రధాన వ్యాధుల్లో ఒకటైన గాలికుంటును అరికట్టడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
KDP: గోపవరం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు ప్రసాద్ రెడ్డిని APIIC డైరెక్టర్గా నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రస్థాయి పదవి వచ్చే విధంగా కృషి చేసిన బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితేశ్ రెడ్డి, మాజీ MLA విజయమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. బద్వేల్ నాయకులకు వరుస పదవులు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NTR: విజయవాడ సెంట్రల్ జోన్లోని పలు పోలీస్ స్టేషన్ల వద్ద దళారులు దందా సాగిస్తున్నారు. స్టేషన్లకు వచ్చే బాధితుల వద్దకు చేరి పోలీసులతో మాట్లాడి న్యాయం చేస్తామంటూ మాయమాటాలు చెప్పి డబ్బులు గుంజుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
కృష్ణా: జిల్లాల పునర్విభజనపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాను విజయవాడగా మార్చి, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూజివీడు, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరును కృష్ణాలో, నందిగామ, జగ్గయ్యపేటలను అమరావతి జిల్లాలో విలీనం చేయనున్నట్లు సమాచారం.
ప్రకాశం: వెలిగండ్ల విద్యుత్ శాఖ ఏ.ఈ రసూల్ రైతులకు విద్యుత్ సరఫరాపై సూచనలు చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. 1 గంట నుంచి సాయంత్రం 6 వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. ఆర్.జి.పురం, మరపగుంట్ల ఫీడర్లకు ఆర్ డి ఎస్ ఎస్ పనుల కారణంగా అంతరాయం ఉంటుదని వినియోగదారులు సహకరించాలని కోరారు.
ATP: రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లకు నలుగురు డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు సి.రామకృష్ణ (మడకశిర), సి.లక్ష్మీప్రసాద్ (అనంతపురం) ఏపీఐఐసీ డైరెక్టర్లుగా, జయప్ప (హిందూపురం) టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్గా, కె.రంగాచారి (అనంతపురం) విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు.