NLR: గత నెల రోజులకు పైగా గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్ల సమ్మె పోరాటంలో భాగంగా నెల్లూరు జిల్లాలోని టీచర్లు నెల్లూరు సిటీ నడిబొడ్డు స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో “బిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. తొలుత స్వతంత్ర పార్క్ వద్ద నుండి ర్యాలీగా నినాదాలు చేస్తూ గాంధీ బొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.