ELR: తన సోదరి అనారోగ్య కారణాలతో బాధపడుతుండడంతో మనస్తాపం చెందిన ఏలూరు మెడికల్ కాలేజీ విద్యార్థి అధిక మోతాదులో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెంకు చెందిన జగదీష్ ప్రస్తుతం వైద్య విద్య 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఉత్తమ విద్యార్థిగా ప్రతిభ కనబరుస్తున్న అతను బుధవారం ఈ ఘటనకు పాల్పడ్డాడు.