SKLM: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు గత ఆరు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్తూరు మండల విద్యాశాఖ అధికారి గోవిందరావుకు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని తెలిపారు.