ప్రకాశం: కొమరోలు ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రంలో ఎక్స్రే మిషన్ ఉన్నప్పటికీ పేషెంట్లకు అందుబాటులో లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం ఎక్స్రే మిషన్ మరమత్తులకు గురికావడంతో ఓ గదిలో ఉంచి తాళం వేశారు. మిషన్కు అధికారులు మరమ్మతులు చేపించకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు ఎక్స్రే సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.