NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో నంద్యాల జిల్లా పాలమర్రి గ్రామానికి చెందిన లక్ష్మీ కుటుంబ సభ్యులు ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు లక్ష్మీ కుటుంబ సభ్యులు రూ. 25 వేల రూపాయల విరాళాన్ని వారు ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను ఇచ్చారు.