KRNL: కర్నూలులోని కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో 21 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. నిరుద్యోగులందరూ ఇంటర్వ్యూలకు హాజరై ఉపాధి అవకాశాలు పొందాలని ఆయన కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అన్నారు.