SKLM: ట్రాఫిక్ నియమాలు పాటించి,హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ ఎస్సై సుధాకర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం కాంప్లెక్స్, ఎస్పీ కార్యాలయం ప్రాంతాలలో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు వాహన చోదకులు, ఆటో డ్రైవర్లుకు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.