GNTR: వినాయకుని కరుణా, కటాక్షాలతో నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆకాంక్షించారు. మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలోని కౌన్సెల్ సమావేశ మందిరంలో బుధవారం వినాయక చవితి వేడుకలు జరిగాయి. వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ కమిషనర్లు సిహెచ్. శ్రీనివాస్, టి. వెంకట కృష్ణయ్య, మేనేజర్ బాలాజీ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.