NLR: ఉదయగిరి నియోజకవర్గంలోని రాళ్లపాడు కుడి కాలువ గేట్ మరమ్మతులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్ట్ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈలు, సిబ్బంది తూము లోపలికి వెళ్లి గేటుకు తాడు కట్టి పైకి లాగేందుకు ప్రయత్నించారు. రెండుసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో గేట్ల మరమ్మతుల నిపుణులను పిలిపించారు. కుడికాలువ నీటి ప్రవాహం లేకపోవడంతో వరి నారుమడులు ఎండిపోతున్నాయని రైతులు అంటున్నారు.