NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో శుక్రవారం దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఐదవరోజు స్కందమాత అలంకారణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని ప్రత్యేక పూలమాలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.