VZM: గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాద్యాయులు పార్వతీపురం ITDA కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న దీక్షలో మంగళవారం ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ నాయకులు సత్యనారాయణ పాల్గొని వారికి మద్దతుగా మాట్లాడుతూ బెదిరింపులు ఆపి సమస్యలు పరిస్కారం చేయాలని డిమాండ్ చేశారు. షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఇతర ఉపాధ్యాయులను డిప్యూటేషన్ వేయడం మానుకోవాలని హితవు పలికారు.