ప్రకాశం: కనిగిరి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 114 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఐదు నెలల వేతన బకాయిలు చెల్లించాలని ఎంఈవో డి.సుబ్బారావును మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పి.వి శేషయ్య శుక్రవారం కలిసి కోరారు. వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. జూన్ వరకు చెల్లించారని మిగిలిన బకాయలు చెల్లింపునకు ప్రభుత్వంకు నివేదిక పంపించామని ఎంఈవో తెలిపారు.