కృష్ణా: మండలంలోని వెల్వడం గ్రామాన్ని ప్రభుత్వ యంత్రాంగం ఆదర్శ సౌరగ్రామంగా అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. PM సూర్యఘర్ పథకం అమలులో భాగంగా వెల్వడంలో ఆదర్శ సౌరగ్రామాల కాంపోనెంట్ అమలు జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామంలో పునరుత్పాదక ఇంధన వినియోగం పెంచేలా పలు కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు తెలిపారు.