VZM: నగర పంచాయతీ, మండల పరిధిలోని అన్ని సచివాలయాల్లో పూర్తిస్థాయిలో నిఘా పెట్టాలని మహిళా పోలీసులకు ఎస్సై బి గణేష్ సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బహిరంగ మద్యపానం, గంజాయి విక్రయాలు, వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని కోరారు.