AP: విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని CM మరోసారి స్పష్టం చేశారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసి పెన్నా వరకు తీసుకెళ్తామన్నారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ సేవలు ప్రారంభించామని చెప్పారు. తూ.గో జిల్లా నల్లజర్లలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో తెలిపారు.