ప్రకాశం: నేరాలు నియంత్రణ అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామని వెలిగండ్ల ఎస్సై మధుసూధన్ రావు అన్నారు. స్థానిక బస్టాండ్ నందు డ్రోన్ పనిచేసే తీరును ప్రజలకు ఆయన వివరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇటీవల దాతల సాయంతో జిల్లా ఎస్పీ దామోదర్ ఈ డ్రోన్ కెమెరాను పోలీస్ స్టేషన్కు ఇచ్చారన్నారు.