VZM: ప్రజలతో పోలీసులు స్నేహభావంతో మమేకం కావడమే పల్లెనిద్ర కార్యక్రమం ఉద్దేశ్యమని ఎస్సై ఎల్ దామోదర్ రావు అన్నారు. పోలీసుల పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి చీపురుపల్లి మండలంలోని గొల్లలములగాం గ్రామంలో పోలీస్ సిబ్బందితో పల్లె నిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు గ్రామ యువత సహకరించాలని కోరారు.