ELR: ద్వారకాతిరుమల మండలం మారంపల్లి గ్రామంలో మండల ఎమ్మెల్సీ ఎన్నికల బూత్ ఇంఛార్జ్ల సమావేశం మండల పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.