SKLM: అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా పాడేరులో ఉన్న మోదు కొండమ్మ తల్లిని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు బుధవారం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కు కున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ సిబ్బంది ఆయనకు సాదర స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆయనతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.