NLR: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం ఫిబ్రవరి నెలకు సంబంధించిన హుండీ లెక్కింపు బుధవారం సాయంత్రానికి ముగిసిందని శ్రీ మఠం మేనేజర్ వెంకటేశ్ జోషి తెలిపారు. హుండీ లెక్కించగా.. రూ.3,21,05,005 కరెన్సీ, రూ.8,10,100 చిల్లర నాణేలతో కలిపి మొత్తం రూ.3,29,15,105 వచ్చిందన్నారు. 58 గ్రాముల బంగారం, 1,280 గ్రాముల వెండి వచ్చినట్లు వెల్లడించారు.