SKLM: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ యువతకు కొత్త ఆశలను నింపిందని నరసన్నపేట నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన అన్నారు. యువగళంలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.