కోనసీమ: మండపేట నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో రాయవరం రూరల్ VSR డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శనివారం తెలిపారు. ఈ జాబ్ మేళాకు SSC, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ ఇతర విద్యా, నైపుణ్య అర్హతలు కలిగిన అభ్యర్థులు అర్హులని చెప్పుకొచ్చారు.