GNTR: రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. క్వింటాలుకు రూ. 1200 చెల్లించి రైతుల నుంచి ఉల్లిని కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని రైతు బజార్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.