SKLM: ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామంలో సూరవారి ఇంటిదైవం శ్రీరాముల వారి సంబరాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ఎంపీపీ మొదలవలస చిరంజీవి దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఆయనతోపాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు దర్శించుకున్న వారిలో ఉన్నారు.