CTR: బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో తమిళనాడుకు చెందిన కంటైనర్ డ్రైవర్ చిరంజీవి, గంగవరం మండలానికి చెందిన టిప్పర్ డ్రైవర్ శ్రీనివాసులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.