NLR: చేజర్ల మండలం ఆదురుపల్లి జడ్పీ హైస్కూల్లో గురువారం కుష్ఠు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కౌమారదశలో ఎదురయ్యే మార్పులపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం జీవీ రమేశ్ బాబు, డీపీఎమ్ ఎం.మోహన్ రావు, వైద్య సిబ్బంది జి. విమలమ్మ, తదితరులు పాల్గొన్నారు.