ATP: మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటన ఖరారైంది. రేపు ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి రాప్తాడుకు చేరుకుంటారు. వైసీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె మోక్షిత వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి తిరిగి బెంగళూరుకు వెళ్లనున్నారు.