కాకినాడ: తుని మండలం కొత్త సురవరంలో శుక్రవారం తుని రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో రాష్ట్రీయ పోషణ మాస ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలు అక్టోబర్ 16 తేదీ వరకు జరుగుతాయని పీవో శ్రీలత తెలిపారు. 6 సంవత్సరాలలోపు పిల్లలకు, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు పోషకాహారంపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.