ATP: అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ కలిశారు. పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ధర్మవరంలో మహిళా ఇండస్ట్రియల్ పార్క్, స్టిచ్చింగ్ యూనిట్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్థికంగా చితికిపోయిన చేనేత మహిళలకు ఉపాధి కల్పించాలని విన్నవించారు.