CTR: చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయానికి కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన భక్తురాలు కృష్ణవేణి రూ.25 వేలను విరాళంగా అందించారు. ఆదివారం ఆలయాన్ని సందర్శించిన ఆమె ఈవో, ఉప కమిషనర్ ఏకాంబరంకు నగదును అందజేశారు. అమ్మవారి కటాక్షంతో సుఖ సంతోషాలు కలగాలని ఈవో ఆకాంక్షించారు. ఆలయ అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.