VZM: వేపాడ మండలం ఎన్ కె ఆర్ పురం ఎంపీపీ పాఠశాలలో నిర్వహిస్తున్న కిచెన్ గార్డెన్ ను ఎం ఈ ఓ- 1 ఎన్ కాశీపతిరాజు బుధవారం పరిశీలించారు. కిచెన్ గార్డెన్ లో సాగు చేస్తున్న కాయగూరలను మధ్యాహ్న భోజన పథకంలో సక్రమంగా వినియోగించాలని సూచించారు. అనంతరం ఆయన పాఠశాల పరిసరాలను, వంటగది, తరగతి గదుల నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.