CTR: ఎస్ఆర్ పురం మండలం డీకే మర్రిపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు శోభ అనే మహిళ పూరిగుడిసెకు నిప్పు పెట్టారు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పూరిగుడిసెలో ఉన్న నిత్యవసర సరుకులు, బీరువాలో ఉన్న 30 వేల డబ్బు పూర్తిగా దగ్ధమైంది. పూరిగుడిసెకు నిప్పు పెట్టిన వారిపై తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.