TG: పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై MP చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం 15 రోజులే నిర్వహించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ భద్రత, ఢిల్లీ కాలుష్యం, ప్రజాస్వామ్యం, రాష్ట్రాల ఆర్థిక భద్రత వంటి కీలక అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రకృతి విపత్తుల సహాయంపై కేంద్రం వైఖరిని ప్రశ్నిస్తామని పేర్కొన్నారు.