అన్నమయ్య: ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాయచోటి పట్టణంలోని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు.