E.G: కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం నందు కొలువు దీరిన శ్రీ సద్గురు సుందర సాయిబాబా మందిరం 30వ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని సాయిబాబా వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్దిపట్ల శివరామ కృష్ణ, కంఠమణి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.